తిమ్మాజి కండ్రిగలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

54చూసినవారు
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజిగ కండిగలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు దోనిపర్తి శ్రీనివాసరావు హైమావతమ్మ దంపతులు హనుమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు ఉభయకర్తలు, భక్తులు స్వామి వారికి పాలు, పెరుగు, చందనం, నెయ్యి వంటి పదార్థాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్