పొదుపు మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అయితే పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత మన జగన్ ది అని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి. సంజీవయ్య అన్నారు. సోమవారం సాయంత్రం తడ మండలంలో ఏర్పాటు చేసిన ఆసరా 4వ విడత సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన 733 గ్రూపులకు 6. 50 కోట్ల ఆసరా చెక్కు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి రఘురెడ్డి, ఏసి మురళి, మండల నాయకులు ఉన్నారు.