ఈనెల 25న వెంగమాంబకు నేలపొంగళ్ళు

76చూసినవారు
ఈనెల 25న వెంగమాంబకు నేలపొంగళ్ళు
దుత్తలూరు మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ పేరంటాలు అమ్మవారి నెల పొంగళ్ళు ఈనెల 25న నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఉషశ్రీ సోమవారం తెలిపారు. నెలపొంగళ్లకు భక్తులు భారీ స్థాయిలో హాజరవుతారని అంచనా తో దేవదాయ శాఖ అధికారులు, వ్యవస్థాపక ధర్మకర్తలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నెలపొంగళ్ళ రోజున భక్తులు అమ్మవారికి పొంగళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్