
జలదంకి: మద్యం షాపు ఏర్పాటు చేయొద్దంటూ రోడ్డెక్కిన మహిళలు
నెల్లూరు జిల్లా జలదంకి మండలం కోదండరామాపురం గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటును నిరసిస్తూ బుధవారం మహిళలు రోడ్డేక్కారు. చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకు రాకపోకలు జరిగే ప్రధాన రోడ్డు మార్గంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కరువవుతుందని కాబట్టి వెంటనే మద్యం షాపు ఏర్పాటు నిర్ణయాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. ఆందోళన విషయం తెలిసిన ఎస్ఐ లతీప్పున్నిషా అక్కడికి చేరుకున్నారు.