నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గుడి నర్వ గ్రామంలో సోమవారం శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.