ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. "లిబరేషన్ కాంగ్రెస్" పేరుతో పార్టీని ఏర్పాటు చేసినట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ప్రకటించారు. గుంటూరులోని నాగార్జున వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికజన మహాసంకల్ప సభలో ఆయన పార్టీ పేరును వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోతోందని తెలిపారు. పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు.