సభ్యులు హాజరు కాక సమావేశం వాయిదా

73చూసినవారు
సభ్యులు పూర్తిస్థాయిలో హాజరుకానందున ఇబ్రహీంపట్నం మండల సర్వసభ్య సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎంపీడీవో జీ. ఉమాదేవి తెలిపారు. సోమవారం ఆమె సమావేశం హాల్లో మీడియాతో మాట్లాడారు. కోరం లేక ఇప్పటికి రెండుసార్లు సమావేశం వాయిదా వేసినట్లుగా తెలిపారు. సమావేశానికి ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, వైస్ ఎంపీపీ1 బండి నాగమణి, తమలపాలం ఎంపిటిసి పోలిశెట్టి తేజ మాత్రమే హాజరైనట్టుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్