వరద బాధితులందరినీ ఆదుకుంటాం

63చూసినవారు
విజయవాడ నగరంలో వరద బాధితులందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బాధితులను సహాయక చర్యల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోనే ఉండి వరద ప్రాంతాల అన్నిటిని సర్దుబాటు చేస్తానన్నారు. మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఒక గంట నాకు టైం ఇవ్వండి అంతా సెట్ చేస్తానంటూ చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్