వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేశారు: జ‌గ‌న్

68చూసినవారు
వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేశారు: జ‌గ‌న్
వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయొద్దని తన మనిషి నిమ్మగడ్డతో చంద్రబాబే ఈసీకి ఫిర్యాదు చేయించార‌ని సీఎం జ‌గ‌న్ మండిప‌డ్డారు. కడుపు మంట చల్లారక వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేశార‌ని విమ‌ర్శించారు. "మేం అధికారంలోకి రాగానే ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తాం. 57 నెలలుగా పెన్షన్లను అవ్వాతాతల ఇంటి వద్దే అందించాం. చంద్ర‌బాబు పాపిష్టి కళ్లు వారిపై పడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి." అని సీఎం ధ్వ‌జ‌మెత్తారు.

సంబంధిత పోస్ట్