పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు ఎన్నికల రోజే నిరసన సెగ తగిలింది. పిఠాపురం నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమె.. ఓటర్లను చూసి ‘మర్చిపోకండి’ అని అంటుంది. దీంతో అక్కడే ఉన్న ఓ పెద్దాయన.. వంగా గీత తీరును తప్పుబట్టారు. పోలింగ్ కేంద్రంలో ప్రచారం ఎలా చేస్తారని ప్రశ్నిస్తారు. దీంతో వంగా గీత బిక్కముఖం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.