నరసరావుపేట: ప్రోటోకాల్ అమలు చేయండి అంటూ కలెక్టర్ కు ఫిర్యాదు

81చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హక్కులను పట్టించుకోవడం లేదని పలువురు జడ్పీటీసీలు నరసరావుపేటలో కలెక్టర్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదన్నారు. అలాగే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై సంబంధిత ప్రజాప్రతినిధుల పేర్లు లేవన్నారు. ప్రోటోకాల్ పాటించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్