పులిచింతల ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు

64చూసినవారు
అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణా నదికి నీటిని విడుదల చేశారు. సోమవారం ఆరు గంటలకు 21 రేడియల్ గేట్ల ద్వారా 6, 02, 310 క్యూసెక్కులు దిగువన ప్రకాశం బ్యారేజికి విడుదల చేస్తున్నట్లు డీఈఈ అరుణకుమారి తెలిపారు. ప్రాజెక్టులో 41. 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నదికి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రాజెక్టు సమీపంలోని జడపల్లి మోటుతండా పొలాలన్నీ నీట మునిగాయి. నది తీర గ్రామాల్లో పుష్కర ఘాట్లు మునిగిపోయాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్