తెర్లాం మండలం పాఠశాల ఆయాలకు అవగాహన సదస్సు

55చూసినవారు
తెర్లాం మండలం పాఠశాల ఆయాలకు అవగాహన సదస్సు
తెర్లాం మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలతో ఎంఈఓ జె. త్రినాథ్ రావు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయాలు పాఠశాలలో పారిశుధ్య పనులు ఎలా నిర్వహించాలో అవగాహన కల్పించారు. మరుగుదొడ్లు రోజు నాలుగుసార్లు పరిశుభ్రత చేయాలని సూచించారు. అనంతరం టాయిలెట్ క్లీనింగ్ కెమికల్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 పాపారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్