ఘనంగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

62చూసినవారు
రామభద్రాపురం మండల పరిధి ఆరికతోట గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ కమిటి సభ్యులు, గ్రామ ప్రజలు భవానీమాతలు కలిసి డప్పులు, మేళతాళాలతో తిరువీధుల్లో ఊరేగింపుగా దుర్గమాతను తీసుకువచ్చారు. పురోహితుడు సూర్యప్రభ ఆధ్యర్యంలో మండపంలో దుర్గాదేవికి ప్రాణ ప్రతిష్ట చేసి, గణపతి పూజారాధన, కలశారాధన ప్రతిష్ట కార్యక్రమం జరిపారు.

సంబంధిత పోస్ట్