జిల్లాస్థాయి జుడో పోటీలకు ఎంపికలు

58చూసినవారు
జిల్లాస్థాయి జుడో పోటీలకు ఎంపికలు
జిల్లాస్థాయి జుడో పోటీలకు రామభద్రపురం మండల పరిధి కొట్టక్కి జెడ్పీ హైస్కూల్లో అండర్-14, 17, 19 విభాగాలకు ఎంఈవో తిరుమల ప్రసాద్ ఆధ్యర్యంలో ఎంపికలను నిర్వహించారు. ఈ ఎంపికల్లో 20 పాఠశాలల నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో అండర్-14 విజేతలైన ఏడుగురు విద్యార్థులకు మాత్రమే ఈ నెల 22, 23 తేదీల్లో తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్