ధాన్యం బస్తాలను ధ్వంసం చేసిన ఏనుగులు

60చూసినవారు
గరుగుబిల్లి మండలంలో గురువారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గిజబ, నందివానివలస గ్రామాల సమీపంలో గల ప్రధాన రహదారిపై ఉన్న 10 ధాన్యం బస్తాలను నాశనం చేసాయి. దాంతో రైతు లబోదిబోమంటున్నారు. పొలాల్లోకి ఏనుగులు చొరబడి పంటలు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు రాత్రి సమయంలో గ్రామాల్లో సంచరిస్తుండడంతో పంట పొలాలకు ఎవరు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్