విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

53చూసినవారు
విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సీతంపేట మండలం మల్లి ఆశ్రమ పాఠశాలను మంగళవారం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పుస్తకాలు, బ్యాగులు తదితరు వాటిని విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. పాఠశాలలో త్రాగునీటి సరఫరా, మరుగుదొడ్లు ఏర్పాటు వంటి సౌకర్యాలు మెరుగైన రీతిలో అందించాలని అక్కడ సిబ్బంది ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సానుకూలంగా హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్