ఆంధ్రా- ఒడిశా పోలీసుల సంయుక్త తనిఖీలు

63చూసినవారు
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా పోలీసుల సంయుక్త తనిఖీలు చేపట్టారు. కొమరాడ, పార్వతీపురం ఎస్ ఐ లు, కోరాపుట్ జిల్లా బందుగాం పోలీస్ స్టేషన్ సిబ్బంది గురువారం పార్వతీపురం మండలం, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో 14, 500 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలమండ గ్రామం వద్ద 32 డ్రంలలో ఉన్న పది వేల లీటర్లను, కర్లి గ్రామం వద్ద 15 డ్రంలలో లభ్యమైన పులియబెట్టిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్