అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

54చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దనవలస గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా వ్యాన్ లో తరలిస్తున్న 250 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఆండ్ర సబ్ ఇన్ స్పెక్టర్ సీతారాం తెలిపారు. పట్టుకున్న 9,000 కిలోల పి డి యస్ బియ్యాన్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు తదుపరి చర్యల నిమిత్తం అప్పగించామన్నారు. వ్యాన్ డ్రైవర్ తో పాటుపి డి యస్ రైస్ తరలిస్తున్న ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్