వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి కోరారు. శుక్రవారం సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలోని కంటుభుక్తవలస గ్రామ శివారులో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆమె ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసిపి అవలంబిస్తున్న అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు..