వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే లలిత కుమారి

65చూసినవారు
వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే లలిత కుమారి
ఎల్ కోట మండలం భీమాలి, రంగరాయపురం అలాగే జామిలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక మండపాల్లో ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుడిని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా అర్చకుల ఆధ్వర్యంలో ఆయా వినాయక మండపాల్లో గల విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గంలో ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్