పవన్ కళ్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు

575చూసినవారు
పవన్ కళ్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు
పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యాపిల్లల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాను ఒక తరం కోసం పని చేస్తున్నానని, మరో రెండు తరాలకు దారి వేసేందుకు నిలబడి ఉన్నానన్నారు. ప్రజల కోసం పాతిక సంవత్సరాలు కష్టపడతానని పార్టీ పెట్టినప్పుడే చెప్పానని పేర్కొన్నారు. రాజకీయాల వల్ల తన బిడ్డల ఆలనా పాలనా చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్