టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు సీట్ల కేటాయింపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఏపీ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొనే టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య సీట్ల పంపకం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల సంఖ్య హెచ్చుతగ్గుల కంటే.. రాష్ట్ర శ్రేయస్సే నాకు ముఖ్యం. రాష్ట్ర పురోభివృద్ధికి కూటమి ఏర్పాటుతో బలమైన పునాది పడింది. ఏపీ అభివృద్ధికి, ప్రగతికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి." అని పవన్ పేర్కొన్నారు.