ఈసీకి పయ్యావుల కేశవ్‌ ఫిర్యాదు

71చూసినవారు
ఈసీకి పయ్యావుల కేశవ్‌ ఫిర్యాదు
పోలీసులు ప్రతిపక్ష పార్టీల నేతలపై బైండోవర్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. శనివారం సచివాలయంలో ముకేశ్‌కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. ‘ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈసీఐ మార్గదర్శకాలు ఉంటే, క్షేత్రస్థాయిలో పోలీసులు అందుకు భిన్నంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారు’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్