పేదలకు పెన్షన్ ఇప్పించే వరకు రాజీ పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. "కలెక్టర్లను కలిసి పెన్షన్ ఇళ్ల వద్దే అందేలా చూడాలి. రాజకీయ స్వార్థం కోసం సీఎం జగన్ పెన్షనర్ల పొట్టకొట్టారు. కూటమి అధికారంలోకి రాగానే రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. ఈ రెండు నెలలు ఎవరికైనా పింఛన్ అందకపోతే.. అది కూడా కలిపి ఇస్తాం." అని బాబు హామీ ఇచ్చారు. టీడీపీ శ్రేణులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన ఈ మేరకు మాట్లాడారు.