టీడీపీ ప్రజాదర్బార్ కు పోటెత్తిన ప్రజలు!

51చూసినవారు
టీడీపీ ప్రజాదర్బార్ కు పోటెత్తిన ప్రజలు!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వీటిల్లో అత్యధిక భాగం గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తమకు అన్యాయం జరిగిందంటూ వచ్చిన వినతులే ఉన్నాయి. తమ భూములను ఆక్రమించుకున్నారంటూ పేదలు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి వినతులు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్