ప్రజలను మరోసారి మోసం చేసేందుకు
జగన్ ‘సిద్ధం’ అయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ’’రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్, మైనింగ్, లిక్కర్ మాఫియానే. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైంది? పూర్తిగా మద్య నిషేధం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనన్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న
బీజేపీ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిందా?, అభ్యర్థులను బదిలీ చేయడం వైసీపీలోనే చూస్తున్నాం’’ అని షర్మిల విమర్శించారు.