ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలు రికార్డు చేశారని, ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే జగన్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందన్నారు. దీనిపై అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.