పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరుడు వెంకట్రామి రెడ్డి తమిళనాడులో సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్పై ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అజ్ఞాతం వీడి నరసరావుపేటకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన తమ్ముడు వెంకట్రామి రెడ్డి పరారీలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. చివరకు బెయిల్కూ దరఖాస్తు చేసుకోలేదు.