పిఠాపురం ఇప్పుడు మెగా పురంగా మారబోతుందని తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందిన పవన్.. తన నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్చరణ్-ఉపాసన దంపతులు పిఠాపురంలో ఆస్పత్రి నిర్మాణం కోసం స్థలం కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కొత్త మూవీ విశ్వంభర ప్రీ రిలీజ్ ఫంక్షన్ పిఠాపురంలో నిర్వహిస్తారని సమాచారం.