ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

582చూసినవారు
ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 3, 4వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడ, 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని మోడీ కూటమి తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు. 3న మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6:30 గంటలకు విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. 4వ తేదీన మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

సంబంధిత పోస్ట్