ప్రభుత్వం మారడంతో ఏపీ సచివాలయంలో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఐటీ వింగ్ అడిషనల్ ఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లను పరిశీలించారు. డేటా బయటకు వెళ్లకుండా ఐటీ వింగ్ సెక్షన్ వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. డేటా మిస్ కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.