ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 23 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. 27 నుంచి జూన్ 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఈ నెల 31 నుంచి జూన్ 5 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 7న సీట్ల కేటాయింపు, 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతోంది. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.