భైరవకోనలో పర్యాటకుల సందడి

82చూసినవారు
సీఎస్ పురం మండలం ప్రముఖ శైవక్షేత్రం భైరవకోనలో ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భైరవకోనను సందర్శించి జలపాతంలో స్నానమాచరించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నగరేశ్వర త్రిముఖ దుర్గాదేవి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పండితులు భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్