పాతసింగరాయకొండలోని శ్రీ వరహాలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 23వ తేదీన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ రథోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్సై శ్రీరామ్, ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం పరిశీలించారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.