రాష్ట్రంలో దరిద్రమైన పరిపాలన సాగుతుంది

65చూసినవారు
రాష్ట్రంలో అరాచకాలతో దరిద్రమైన పరిపాలన సాగుతుందని సంతనూతలపాడు వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా అరస్టయిన మాజీ ఎంపీ సురేష్ ను వైఎస్ జగన్ పరామర్శించడానికి వెళ్తే టిడిపి నేతలు గావుకేకులు పెడుతున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు పరామర్శలకు టిడిపి నాయకులు జైలుకు వెళ్లలేదా? అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్