ప్రజలంతా పోలీసులకు సహకరించాలి

59చూసినవారు
ప్రజలంతా పోలీసులకు సహకరించాలి
పుల్లలచెరువు మండలంలో పోలింగ్ ముందు, తర్వాత గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని ఎస్సై ఫిరోజ్ ఫాతిమా తెలిపారు. గొడవలు జరిగితే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహారించేలా జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చారని అందుకే ప్రజలంతా సంయమనం పాటించి అధికారులకు సహకరించాలని కోరారు. గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలు, స్థానిక పోలీసులు నిరంతరం విధుల్లో ఉంటున్నట్లు తెలిపారు. సహకరిస్తున్న ప్రజలకు అన్నివేళలా పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్