ఏప్రిల్ 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అద్దంకి మండల ఎంపీడీవో సత్యనారాయణ సోమవారం మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. పెన్షన్ దారులు ఆందోళన పడవలసిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం గ్రామ సచివాలయాల వద్ద అధికారులు పెన్షన్లు పంపిణీ చేస్తారని ఎంపీడీవో సత్యనారాయణ తెలియజేశారు. ఒకటో తేదీన బ్యాంకులకు ఆడిట్ ఉండటంతో పెన్షన్లు పంపిణీ కాలేదన్నారు.