అద్దంకి మండలం ఏలేశ్వరవారిపాలెం గ్రామంనందు బుధవారం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పానెం.చిన్నహనిమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.గ్రామంలో గడపగడపకు తిరుగుతూ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకం అవుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గా మళ్ళీ జగన్ ను అద్దంకి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని గ్రామస్తులను కోరారు.