తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 12 సంవత్సరాల తర్వాత నిన్న 23 ఏప్రియల్, మంగళవారం నాడు 4 గంటల పాటు ఏకధాటిగా ప్రముఖ న్యూస్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గ్రామాలు మొదలు, పట్టణాలు, మెట్రో సిటీల వరకూ లక్షలాది మంది జనం టీవీలకు అతుక్కుపోయారు.. ఐపీఎల్ మ్యాచ్ను చూడండం మానేసి మరీ కేసీఆర్ డిబేట్నే ఆసక్తిగా వేలాది మంది తిలకించారు. ఇది కేసీఆర్ మాస్టర్ క్లాస్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.