ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి: ఏవో

72చూసినవారు
ఖరీఫ్ సీజన్ లో సాగు చేసే పంటలకు ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని దర్శి మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ రైతులకు సూచించారు. దర్శిలోని ఏవో కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ పంట వేసిన ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలన్నారు. లేదంటే ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర, సున్నా వడ్డీ తదితర ప్రభుత్వ పథకాలు వర్తించవన్నారు. సమీప ఆర్బీకే కేంద్రాలలకు వెళ్లి ఈ క్రాప్ బుక్ చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్