కనిగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది వృద్ధాప్య, వితంతువు, వికలాంగుల వారికి పింఛన్లు పంపిణీ చేయాలంటూ మంగళవారం కనిగిరి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ పెన్షన్లు పంపిణీ చేయకుండా టీడీపీ అడ్డుకుందని వైసిపి వారు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారం నమ్మరని అన్నారు.