విశాఖ డ్రగ్స్ ఘటనపై ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. "విశాఖలో పట్టుబడిన మాదకదవ్యాల కంటైనర్కు, పురందేశ్వరి వియ్యంకుడు కె.వి.ప్రసాద్కు ఎలాంటి సంబంధం లేదు. పురందేశ్వరి, చంద్రబాబు పేరు వాడుకుని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వైసీపీ యత్నిస్తోంది. వరల్డ్ డ్రగ్ డాన్ పాబ్లో ఎస్కోబార్ను తలదన్నెలా మన ఆంధ్రా డాన్ తయారయ్యారు." అని రఘురామ విమర్శించారు.