విశాఖ డ్రగ్స్ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీని నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తామని చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా డ్రగ్స్పై దృష్టి పెట్టాలని కోరతామన్నారు.