అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పరోక్షంగా సెటైర్లు వేశారు. ‘సింహం లాగా చెప్పుకునే వారు నిన్న సభకు వచ్చి తమ పేరు మర్చిపోయి తడబడ్డారు. అయ్యన్నను స్పీకర్గా ఎన్నుకుంటున్నామని తెలియగానే వాళ్లు పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇకపై వైసీపీ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో.’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.