రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు

76చూసినవారు
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు
నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.

సంబంధిత పోస్ట్