బూమ్ బూమ్ బీరు తాగి రాకేష్ మాస్టర్ చనిపోయారు: మంత్రి కొల్లు

78చూసినవారు
దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతిపై ఏపీ అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ఇష్టమొచ్చినట్లు వైసీపీ నేతలు మద్యం విక్రయించారని ఆరోపించారు. 'బూమ్ బూమ్ బీరు తాగి రాకేష్ మాస్టర్ చనిపోయారు. బీరు తాగే ముందే తేడాగా ఉందని ఆయన చెప్పిన వీడియోలూ వైరల్ అయ్యాయి. ఏపీకి వస్తే ఇవి తప్ప ఏం దొరకడం లేదని ఆయన అన్నారు. ఇలాంటి చెప్పుకోలేని ఘటనలు చాలా ఉన్నాయి' అని మంత్రి వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్