ఏపీలో వరద బాధితులకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ రూ.20 కోట్ల భారీ విరాళం

57చూసినవారు
ఏపీలో వరద బాధితులకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ రూ.20 కోట్ల భారీ విరాళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, వరదలతో విలవిల్లాడిన వరద బాధితులకు సాయం చేసేందుకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. తన వంతుగా సీఎం సహాయ నిధికి రూ.20 కోట్ల సాయాన్ని అందజేసింది. ఈ మేరకు రిలయన్స్‌ సంస్థ ప్రతినిధులు పీఎంఎస్‌ ప్రసాద్‌, పీవీఎల్‌ మాధవరావు సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్