AP: రాష్ట్రంలో రబీ కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం చేపట్టిన అధ్యయనం పూర్తయింది. ఈ అధ్యయన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అధికారుల బృందం అందజేసింది. నష్టపోయిన పంట వివరాలను గురించి నివేదికలో వివరించింది. రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.319.77 కోట్లు సాయం చేయాలని సూచించింది.