రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వినతులు: మంత్రి లోకేశ్

79చూసినవారు
రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వినతులు: మంత్రి లోకేశ్
AP: తొలుత మంగళగిరి ప్రజల కోసం మొద‌లుపెట్టిన 'ప్రజాదర్బార్‌'కు ఇప్పుడు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వినతులు వ‌స్తున్నాయ‌ని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉండవల్లిలో 12వ రోజు కొనసాగిన ప్రజాదర్బార్‌కు ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చార‌ని పేర్కొన్నారు. వినతిపత్రాలను ఆయా శాఖలకు పంపి పరిష్కరించేందుకు ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్